హైదరాబాదులో మెట్రో ఫేర్ పెంపు ఈ రోజు నుంచి ప్రారంభం

హైదరాబాద్ మెట్రో రైలు టికెట్ ధరలు పెరిగాయి

హైదరాబాద్ మెట్రో రైలు టికెట్ ధరలు ఇవాళ (నేడు) నుంచి పెరిగాయి. కనీస టికెట్ ధర ₹10 నుండి ₹12కి మారింది. గరిష్ఠ ధర ₹60 నుండి ₹75కి పెరిగింది. ఈ టికెట్ ధరలు ప్రయాణ దూరం ఆధారంగా ₹2 నుండి ₹16 వరకు పెరిగాయి అని లార్సన్ & టుబ్రో (ఎల్ అండ్ టి) సంస్థ తెలిపింది.

మెట్రో నిర్వహణ మరియు రిపేర్ ఖర్చులు పెరగడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నారని మెట్రో అధికారులు తెలిపారు. కోవిడ్ సమయంలో ప్రయాణికుల సంఖ్య తగ్గిపోయి ఆర్థిక నష్టాలు జరిగాయి.

ఇంకా, రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత బస్సు ప్రయాణ పథకం కూడా మెట్రో ప్రయాణికుల సంఖ్య తగ్గడానికి కారణమైంది. అందుకే, ధరలు పెంచడం ద్వారా మెట్రో వ్యవస్థను నిలబెట్టుకోవడం ముఖ్యమని వారు చెప్పారు. దీని వల్ల మెట్రోకు ₹150 కోట్లు నుంచి ₹200 కోట్లు అదనంగా లభించనున్నాయని అంచనా.


Today's Best Deals

Rs. 270.00

Emoji Expressions Matching Game

Rs. 480.00

Labubu Bunny Keychain

Rs. 100.00

Face Changing Keychain

Rs. 230.00

Busy Book