మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న ‘మన శంకరవర ప్రసాద్’ (MSG) చిత్రానికి సంబంధించిన మరో కీలక అప్డేట్ విడుదలైంది. ఇప్పటికే విడుదలైన తొలి పాట ‘మీసాల పిల్ల’ చార్ట్బస్టర్గా నిలిచి సంగీత ప్రేమికులను అలరిస్తుంటే, తాజాగా రెండో పాట విడుదల తేదీని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.
‘శశిరేఖ’ పేరుతో రానున్న ఈ రెండో పాటను ఈ నెల 8న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అంతకంటే రెండు రోజుల ముందుగా అంటే ఈ నెల 6న ఈ పాటకు సంబంధించిన ప్రోమోను విడుదల చేయనున్నారు. తొలి పాట సాధించిన విజయంతో రెండో పాటపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మెగాస్టార్తో పాటు విక్టరీ వెంకటేశ్, నయనతార, కేథరిన్ థ్రెసా వంటి అగ్ర తారలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్పై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల, వి. హరికృష్ణ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సంగీతాన్ని భీమ్స్ సిసిరోలియో అందిస్తున్నారు.
భారీ తారాగణం, ప్రముఖ సాంకేతిక నిపుణులతో రూపొందుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.