దక్షిణ మధ్య రైల్వే నుండి 44 ప్రత్యేక వారపు రైళ్లు
ప్రయాణికుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో, దక్షిణ మధ్య రైల్వే మొత్తం 44 ప్రత్యేక వారపు రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. ఈ రైళ్లు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని ముఖ్యమైన ప్రాంతాలను కలుపుతాయి.
-
విశాఖపట్నం నుండి బెంగళూరు వరకు (ట్రైన్ నం. 08581) ప్రతి ఆదివారం జూన్ 1 నుండి జూన్ 29 వరకు నడుస్తుంది. తిరుగు ప్రయాణం (ట్రైన్ నం. 08582) బెంగళూరు నుండి విశాఖపట్నం వరకు ప్రతి సోమవారం జూన్ 2 నుండి జూన్ 30 వరకు జరుగుతుంది.
-
విశాఖపట్నం నుండి తిరుపతి వరకు (ట్రైన్ నం. 08547) ప్రతి బుధవారం జూన్ 4 నుండి జూలై 30 వరకు నడుస్తుంది. తిరుగు రైలు (ట్రైన్ నం. 08548) తిరుపతి నుండి విశాఖపట్నం వరకు ప్రతి గురువారం జూన్ 5 నుండి జూలై 31 వరకు నడుస్తుంది.
-
విశాఖపట్నం నుండి చర్లపల్లి వరకు (ట్రైన్ నం. 08559) ప్రతి శుక్రవారం జూన్ 6 నుండి జూలై 27 వరకు నడుస్తుంది. తిరుగు రైలు (ట్రైన్ నం. 08580) చర్లపల్లి నుండి విశాఖపట్నం వరకు ప్రతి శనివారం జూన్ 7 నుండి జూలై 26 వరకు నడుస్తుంది.
ప్రయాణికులు ఈ ప్రత్యేక రైలు సేవలను వినియోగించుకోవాలని దక్షిణ మధ్య రైల్వే కోరింది.