సికింద్రాబాద్ – తిరువనంతపురం (త్రివేండ్రం) మధ్య ప్రయాణించే వారికి రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. ఎంతో కీలకమైన శబరి ఎక్స్ప్రెస్ను ఇకపై సూపర్ఫాస్ట్ రైలుగా నడపనుంది. ఈ మార్పులు నేటి నుంచే అమల్లోకి వచ్చాయి. దీంతో ప్రయాణికులు సుమారు రెండు గంటల ప్రయాణ సమయం ఆదా చేసుకోవచ్చు.
ఇకపై ఈ రైలు నంబర్ 17229/30 నుంచి 20629/30గా మారింది. అలాగే రెండు వైపులా ప్రయాణ వేళల్లో కూడా మార్పులు జరిగాయి.
సికింద్రాబాద్ నుంచి తిరువనంతపురం:
- కొత్త టైమింగ్ – ప్రతిరోజూ మధ్యాహ్నం 2:00 గంటలకు బయలుదేరి, మరుసటి రోజు సాయంత్రం 6:25 గంటలకు చేరుకుంటుంది.
- పాత టైమింగ్ – మధ్యాహ్నం 12:20 గంటలకు బయలుదేరి, మరుసటి రోజు సాయంత్రం 6:05 గంటలకు చేరేది.
తిరువనంతపురం నుంచి సికింద్రాబాద్:
- బయలుదేరే సమయం యథాతథంగా ఉదయం 6:45 గంటలకే ఉంటుంది.
- కొత్త చేరిక – ఉదయం 11:00 గంటలకు సికింద్రాబాద్ చేరుతుంది.
- పాత చేరిక – మధ్యాహ్నం 12:45 గంటలకు చేరేది.
ఈ మార్పుల వల్ల ప్రయాణికులు త్వరగా, సౌకర్యవంతంగా గమ్యస్థానాలకు చేరవచ్చని రైల్వే అధికారులు తెలిపారు.