దేశంలో కోట్లాది మంది ఉపయోగిస్తున్న యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI) చెల్లింపుల్లో సరికొత్త విధానం ప్రారంభమైంది. ఇప్పటి వరకు 4 లేదా 6 అంకెల పిన్ ద్వారా జరిగే లావాదేవీలను ఫేస్ రికగ్నిషన్ లేదా ఫింగర్ప్రింట్ ద్వారా సులభంగా, సురక్షితంగా పూర్తి చేయవచ్చు.
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ఈ కొత్త ఫీచర్ను అభివృద్ధి చేసి, ముంబైలో అధికారికంగా ప్రారంభించింది. పిన్కు ప్రత్యామ్నాయం మాత్రమే అయిన ఈ సౌకర్యం చెల్లింపుల ప్రక్రియను వేగవంతంగా, సురక్షితంగా మారుస్తుందని NPCI తెలిపారు.
PIN ఆధారిత మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) సూచనల మేరకు UPIలో బయోమెట్రిక్ విధానం అందుబాటులోకి వచ్చింది. ముఖ్యంగా కొత్త యూజర్లు మరియు వృద్ధులు ఈ విధానంలో చాలా సౌకర్యాన్ని పొందగలరు. ఇప్పుడు వినియోగదారులు తమ ముఖం లేదా వేలిముద్ర ద్వారా క్షణాల్లో లావాదేవీలు పూర్తిచేయగలరు, దీని ద్వారా డిజిటల్ చెల్లింపులు మరింత మందికి చేరతాయని NPCI ఆశాభావం వ్యక్తం చేసింది.