ప్రధాని మోదీ రూపంలో మన దేశానికి సమర్థవంతమైన నాయకత్వం లభించిందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. భారత్ది “డెడ్ ఎకానమీ” కాదని, “గుడ్ ఎకానమీ” అని ఆయన స్పష్టం చేశారు. భారతీయులకు ఉద్యోగాలు ఇవ్వని దేశాలు అసలైన అభివృద్ధి సాధించలేవని ఆయన వ్యాఖ్యానించారు.
విజయవాడలో జరిగిన ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు, పింగళి వెంకయ్య విగ్రహానికి నివాళులర్పించి, ఆయన జీవిత చరిత్ర పుస్తకాన్ని ఆవిష్కరించారు. మువ్వన్నెల జెండా ప్రతి భారతీయునికి గర్వకారణమని, దేశ సమగ్రత మరియు భద్రత విషయంలో భారత్ ఎప్పుడూ తలవంచదని ఆయన అన్నారు. కార్గిల్ యుద్ధం వంటి సందర్భాల్లో దేశ ప్రజలు ఏకమై నిలిచిన విషయాన్ని గుర్తుచేశారు.
చంద్రబాబు తెలిపారు, మోదీ 11 ఏళ్ల పాలనలో భారత్ ఆర్థిక వ్యవస్థ 11వ స్థానంలోనుంచి 4వ స్థానానికి చేరుకుందని, 2028 నాటికి 3వ స్థానానికి చేరుతుందని అన్నారు. 2047లో భారత్ ప్రపంచంలోనే శక్తివంతమైన దేశంగా, ఆంధ్రప్రదేశ్ దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా నిలవడం లక్ష్యమని స్పష్టం చేశారు.