చంద్రబాబు నాయుడు: కూటమి ప్రభుత్వ ఏడాది పాలనపై నేడు అమరావతిలో ‘సుపరిపాలనలో తొలి అడుగు’ పేరుతో బహిరంగ సభ

సుపరిపాలనలో తొలి అడుగు పేరుతో అమరావతిలో బహిరంగ సభ

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈ నెల 12వ తేదీతో ఒక సంవత్సరం పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా అమరావతి రాజధానిలో నేడు సుపరిపాలనలో తొలి అడుగు పేరుతో బహిరంగ సభ నిర్వహించనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.

మొదట ఈ బహిరంగ సభను 12వ తేదీన నిర్వహించే యోచన ఉండగా, గుజరాత్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాదం కారణంగా ఈ కార్యక్రమాన్ని ఈ రోజు వాయిదా వేసారు.

ఈ కార్యక్రమానికి రాష్ట్ర సచివాలయం వెనుక భాగంలో వేదిక సిద్ధం చేశారు. సాయంత్రం 5 గంటలకు ప్రారంభమయ్యే ఈ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రసంగిస్తారు. ఈ ఏడాది కాలంలో ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు, అలాగే రాబోయే నాలుగేళ్లలో చేపట్టనున్న ప్రాజెక్టుల వివరాలు ఇస్తారు.

సమాచారం ప్రకారం, ఈ సభలో ముఖ్యమంత్రి వివిధ శాఖల మంత్రులను వారి పనితీరుపై ప్రశ్నిస్తూ సమాధానాలు పొందనున్నాడు. కూటమి నేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజా ప్రతినిధులు, ముఖ్య కార్యదర్శి, హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్లు, సెక్రటరీలు, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు కూడా ఈ సభకు హాజరుకానున్నారు.

అమరావతిలో బహిరంగ సభ నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి.


Today's Best Deals

Rs. 270.00

Emoji Expressions Matching Game

Rs. 480.00

Labubu Bunny Keychain

Rs. 100.00

Face Changing Keychain

Rs. 230.00

Busy Book