ఆంధ్రప్రదేశ్ వర్షాలు: బంగాళాఖాతంలో అల్పపీడనం – ఏపీలో భారీ వర్షాలు

అమరావతి వాతావరణ కేంద్రం ప్రకారం, రానున్న ఐదు రోజులపాటు ఆంధ్రప్రదేశ్‌లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. బంగాళాఖాతంలో రేపు ఏర్పడనున్న అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని హెచ్చరించింది. ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ముఖ్యంగా నేడు 12 జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.

ప్రైవేట్ వాతావరణ సంస్థ స్కైమెట్ ప్రకారం, బంగాళాఖాతంలోని అల్పపీడనం వాయుగుండంగా బలపడి, శనివారం నాటికి తీరం దాటే అవకాశం ఉంది. దీని ప్రభావంతో రేపటి నుంచి ఈ నెల 20వ తేదీ వరకు దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది.

రాష్ట్రానికి సంబంధించి రేపటి నుంచి శుక్రవారం వరకు కోస్తాంధ్ర, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. మంగళవారం అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, ఏలూరు, పశ్చిమగోదావరి, ఎన్టీఆర్, కృష్ణా, పల్నాడు, గుంటూరు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

ఇప్పటికే రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం నుంచి సోమవారం ఉదయం వరకు వైఎస్సార్, కర్నూలు, నంద్యాల, శ్రీ సత్యసాయి, చిత్తూరు, ఎన్టీఆర్, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు నమోదయ్యాయి. నిన్న పల్నాడు, తూర్పుగోదావరి, గుంటూరు, ప్రకాశం, కృష్ణా, బాపట్ల జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురిశాయి.


Today's Best Deals

Rs. 270.00

Emoji Expressions Matching Game

Rs. 480.00

Labubu Bunny Keychain

Rs. 100.00

Face Changing Keychain

Rs. 230.00

Busy Book