సింహాచలం గిరి ప్రదక్షిణ సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు – రేపు సాయంత్రం 5 గంటల వరకు అమల్లో
సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వామి గిరి ప్రదక్షిణ మహోత్సవం సందర్భంగా విశాఖపట్నం నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చీ ప్రకటించారు.
ఈ ఆంక్షలు ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి రేపు (గురువారం) సాయంత్రం 5 గంటల వరకు అమల్లో ఉంటాయని తెలిపారు.
ప్రధాన ట్రాఫిక్ మార్పులు:
-
అడివివరం నుంచి గోపాలపట్నం పెట్రోల్ బంక్ వరకు వాహనాలకు ప్రవేశం లేదు
-
భక్తుల వాహనాల కోసం ప్రత్యేక పార్కింగ్ స్థలాల ఏర్పాటు
-
నగరంలోకి భారీ వాహనాల రాకపోకలపై నిషేధం
-
ప్రజలు సహకరించాలని పోలీస్ శాఖ విజ్ఞప్తి
భక్తులకు సూచనలు:
-
అడివివరం వైపు నుంచి వచ్చే భక్తులు తమ వాహనాలను అడివివరం కూడలి వద్ద పార్క్ చేసి కాలినడకన ప్రదక్షిణ మార్గంలోకి వెళ్లాలి.
-
వేపగుంట, గోపాలపట్నం వైపు నుంచి వచ్చే భక్తులు తమ వాహనాలను సింహపురం కాలనీ వద్ద ఏర్పాటు చేసిన పార్కింగ్ ప్రాంగణాల్లో నిలపాలి.
ప్రత్యామ్నాయ మార్గాలు & ఆంక్షలు:
-
సత్తరువు జంక్షన్ నుంచి అడివివరం వైపునకు మాత్రమే వాహనాలకు అనుమతి ఉంటుంది.
అక్కడి నుంచి హనుమంతవాక వైపు ప్రయాణం చేయలేరు. -
గోపాలపట్నం పెట్రోల్ బంక్ నుంచి పాత గోశాల కూడలి వైపు వాహనాలకు ప్రవేశం లేదు.
భారీ వాహనాల రాకపోకలపై ఆంక్షలు:
-
పెందుర్తి, NAD కూడళ్ల నుంచి గోపాలపట్నం వైపు భారీ వాహనాలను అనుమతించరు.
-
అనకాపల్లి నుంచి నగరంలోకి వచ్చే భారీ వాహనాలను లంకెలపాలెం వద్ద సబ్బవరం వైపు మళ్లిస్తున్నారు.
పోలీసులు ప్రయాణికులు తమ ప్రయాణాలను ముందుగానే ప్లాన్ చేసుకోవాలని సూచించారు. పోలీసు ఆదేశాలు పాటించి సహకరించాలని కోరుతున్నారు.