BSNL 5G సేవలు త్వరలో దేశవ్యాప్తంగా – పరికరాల కోసం కీలక ఒప్పందం

ప్రభుత్వ టెలికాం సంస్థ BSNL కూడా ఇప్పుడు ప్రజలకు హై స్పీడ్ ఇంటర్నెట్ అందించడానికి సిద్ధమైంది. ఈ హై స్పీడ్ రేసులో పూర్తి శక్తితో చేరడానికి కంపెనీ సిద్ధమవుతోంది. ఈ పని కోసం BSNL టాటా గ్రూప్‌కు చెందిన టెలికాం పరికరాల తయారీ సంస్థ తేజస్ నెట్‌వర్క్తో చేతులు కలిపింది. తేజస్ నెట్‌వర్క్ రూ. 7,492 కోట్ల విలువైన ఒప్పందం కింద 1 లక్ష 4G-5G సైట్‌లకు BSNLకు పరికరాల సరఫరాను పూర్తి చేసింది.

త్రైమాసిక గణాంకాల గురించి సమాచారం ఇస్తూ, తేజస్ నెట్‌వర్క్ CEO ఆనంద్ ఆత్రేయ మాట్లాడుతూ.. 4G/5G నెట్‌వర్క్ కోసం 1 లక్షకు పైగా సైట్‌లను BSNLకు పంపినట్లు తెలిపారు. ఇది రికార్డు సమయంలో డెలివరీ చేయబడిన ప్రపంచంలోనే అతిపెద్ద సింగిల్ వెండర్ RAN నెట్‌వర్క్ డెలివరీలలో ఒకటి. ఈ ఘనతకు C-DOT, TCS, BSNLలని ప్రశంసిస్తూ, ప్రతి ఒక్కరూ అద్భుతమైన పనితీరు కనబర్చారని ఆయన చెప్పారు.

BSNL 4G సేవలు ఎప్పుడు ప్రారంభమవుతాయి?

వినియోగదారుల కోసం BSNL 4G సేవ వచ్చే నెల అంటే జూన్ నుండి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో 4G సేవలు అందుబాటులోకి రాగానే ఇక పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుంది. దీని తరువాత, కంపెనీ తన 4G నెట్‌వర్క్‌ను 5Gకి అప్‌గ్రేడ్ చేయాలని కూడా యోచిస్తోంది. ప్రస్తుతం కంపెనీ ప్రజల కోసం 5G సేవను ఎప్పుడు ప్రారంభించవచ్చనే దాని గురించి ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. ఇప్పుడు ప్రభుత్వ సంస్థ కూడా హై స్పీడ్ ఇంటర్నెట్ రేసులో ప్రైవేట్ కంపెనీలతో పోటీ పడటానికి సిద్ధమవుతోంది.

తేజస్ ఆధునాతన సాంకేతికతపై పనిచేస్తోంది:

ఈ టాటా గ్రూప్ కంపెనీ జపనీస్ కంపెనీ NEC కార్పొరేషన్తో చేతులు కలిపింది. ఈ భాగస్వామ్యం కింద రెండు కంపెనీలు రేడియో యాక్సెస్ నెట్‌వర్క్ టెక్నాలజీ, అధునాతన వైర్‌లెస్ టెక్నాలజీ, కోర్ నెట్‌వర్క్ సొల్యూషన్స్పై కలిసి పనిచేస్తాయి.


Today's Best Deals

Rs. 270.00

Emoji Expressions Matching Game

Rs. 480.00

Labubu Bunny Keychain

Rs. 100.00

Face Changing Keychain

Rs. 230.00

Busy Book