తెలంగాణకు డబుల్ అలర్ట్ – పొంగుతున్న నదులు, అతి భారీ వర్షాల హెచ్చరిక

రేపు తెలంగాణలో కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాల హెచ్చరిక జారీ చేయబడింది. బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడటంతో రేపు రాత్రి వరకు రాష్ట్రంలో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఇప్పటికే కృష్ణా, గోదావరి నదులు వరద నీటితో ఉప్పొంగుతున్నాయి. నాగార్జున సాగర్ ప్రాజెక్టు పూర్తి నీటిమట్టానికి దగ్గరగా ఉంది; బుధవారం సాయంత్రం వరకు 3.66 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం ప్రాజెక్టులోకి వచ్చింది, దాదాపు 3.20 లక్షల క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు.

శ్రీశైలం జలాశయానికి భారీగా వరద వస్తుండటంతో, అదనపు నీటిని సాగర్‌కు వదులుతున్నారు. మహారాష్ట్ర నుంచి వచ్చే వరదలు బాసర వద్ద గోదావరిని ఉగ్రరూపంలోకి మార్చాయి, స్నానఘట్టాలు పూర్తిగా నీట మునిగాయి. సింగూరు ప్రాజెక్టులో 8 గేట్లను ఎత్తి 67,000 క్యూసెక్కుల పైగా నీటిని విడుదల చేస్తున్నారు. ఇప్పటికే నిండుగా ఉన్న జలాశయాలకు రాబోయే వర్షాలు తోడైతే పరిస్థితి మరింత తీవ్రంగా మారే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, అత్యవసర పరిస్థితుల కోసం స్థానిక అధికారులు సూచనలను అనుసరించాలి.


Today's Best Deals

Rs. 270.00

Emoji Expressions Matching Game

Rs. 480.00

Labubu Bunny Keychain

Rs. 100.00

Face Changing Keychain

Rs. 230.00

Busy Book