జులై 3 నుండి 25 వరకు సికింద్రాబాద్ - నాగర్సోల్ స్పెషల్ రైళ్లు – షిర్డీ భక్తులకు శుభవార్త
షిర్డీ సాయిబాబా దర్శనానికి వెళ్లే భక్తుల రద్దీ దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. జులై 3 నుండి 25 వరకు సికింద్రాబాద్ - నాగర్సోల్ మధ్య స్పెషల్ రైళ్లు నడపనున్నట్లు ప్రకటించింది.
సికింద్రాబాద్ - నాగర్సోల్ స్పెషల్ రైలు (07007) ప్రతి గురువారం సికింద్రాబాద్ నుంచి రాత్రి 9:20 గంటలకు బయలుదేరి, తదుపరి రోజు ఉదయం 9:45 గంటలకు నాగర్సోల్ చేరుకుంటుంది.
నాగర్సోల్ - సికింద్రాబాద్ స్పెషల్ రైలు (07002) ప్రతి శుక్రవారం సాయంత్రం 5:30 గంటలకు నాగర్సోల్ నుంచి బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 7:30 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. ఈ రైలు మల్కాజ్గిరి, బొల్లారం, మేడ్చల్, కామారెడ్డి, నిజామాబాద్, బాసర, ముద్ఖేడ్, నాందేడ్, పూర్ణ, పర్బనీ, జాల్నా, ఔరంగాబాద్ స్టేషన్లలో ఆగుతుంది. రైలులో ఫస్ట్ ఏసీ, సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ కోచ్లు అందుబాటులో ఉంటాయని రైల్వే తెలిపింది.