ఆర్బీఐ పాలసీ ముందు మార్కెట్లు స్థిరంగా ప్రారంభం – రెపో రేటు కోతపై ఊహాగానాలు
భారతీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం ఉదయం స్థిరంగా ప్రారంభమయ్యాయి. భారత రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ) నుండి రెపో రేటుపై కీలక నిర్ణయం వెలువడనుంది. మార్కెట్ వర్గాలు 25 బేసిస్ పాయింట్ల మేరకు రెపో రేటును తగ్గించే అవకాశం ఉందని భావిస్తున్నాయి. ఉదయం ట్రేడింగ్లో ఐటీ, ప్రభుత్వ బ్యాంక్ షేర్లలో కొంత కొనుగోళ్ల ఆసక్తి కనిపించింది.
ఉదయం 9:23 గంటలకి, సెన్సెక్స్ 82.43 పాయింట్ల నష్టంతో 81,359.61 వద్ద ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ 7.70 పాయింట్లు నష్టపోయి 24,743.20 వద్ద ఉంది. బ్యాంక్ నిఫ్టీ మాత్రం స్వల్ప లాభంతో 55,765.70 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ మిడ్క్యాప్ 100 సూచీ 146.25 పాయింట్లు పెరిగి 58,449.25 వద్ద, స్మాల్క్యాప్ 100 సూచీ 65.50 పాయింట్లు పెరిగి 18,498.10 వద్ద ఉన్నాయి.
2026 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వృద్ధి, ద్రవ్యోల్బణంపై ఆర్బీఐ చెప్పే వ్యాఖ్యలు కీలకమవుతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ద్రవ్యోల్బణ అంచనా 4%కి తక్కువగా ఉంటే మార్కెట్లు సానుకూలంగా స్పందించే అవకాశముంది. నిఫ్టీకి 24,500 వద్ద మద్దతు, 25,000 వద్ద ప్రతిఘటన కనిపించవచ్చు. ఇండియా VIX 4.21% తగ్గి 15.08కి చేరింది, ఇది మార్కెట్లో తక్కువ ఒడిదుడుకులు సూచించచ్చు. జూన్ 5న విదేశీ సంస్థలు రూ.208.47 కోట్ల ఈక్విటీలను అమ్మగా, దేశీయ సంస్థలు రూ.2,382.40 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశాయి. ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ఉన్నాయి. అమెరికా మార్కెట్లు నష్టాలతో ముగిశాయి.