సీబీఎస్‌ఈ 10వ, 12వ ఫలితాల విడుదల తేదీ 2025

హైదరాబాద్‌, మే 5: దేశవ్యాప్తంగా సుమారు 42 లక్షల మంది విద్యార్థులు సీబీఎస్‌ఈ 10వ తరగతి మరియు 12వ తరగతి ఫలితాల కోసం ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. పరీక్షలు ముగించి దాదాపు నెల రోజులు గడిచినా ఫలితాలు ఇంకా విడుదలకాకపోవడంతో విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది.

ఈ నేపథ్యంలో మే 6 ఉదయం 11 గంటలకు ఫలితాలు విడుదల అవుతాయన్నట్లు సోషల్‌మీడియాలో ఫేక్‌ వార్తలు వైరల్‌ అవుతున్నాయి. సీబీఎస్‌ఈ పేరిట రూపొందించినట్లు ఉన్న ఓ నకిలీ లేఖ కూడా ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతోంది.

ఈ ఫేక్ ప్రచారంపై స్పందించిన సీబీఎస్‌ఈ బోర్డు, ఇలాంటి అసత్య వార్తలను నమ్మకండని విద్యార్థులకు విజ్ఞప్తి చేసింది. మే 6న ఫలితాలు విడుదల చేయడంలేదని స్పష్టంగా పేర్కొంది. ఫలితాలపై సరైన సమాచారం కోసం విద్యార్థులు మరియు తల్లిదండ్రులు **సీబీఎస్‌ఈ అధికారిక వెబ్‌సైట్ (https://cbse.gov.in)**‌ను మాత్రమే సందర్శించాలని బోర్డు సూచించింది.

గత ఏడాది మే 13న ఫలితాలు విడుదల చేసిన దృష్ట్యా, ఈ ఏడాది కూడా మే రెండో వారంలో ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఫలితాల తేదీ ఖచ్చితంగా నిర్ణయమైన తర్వాత అధికారికంగా వెబ్‌సైట్‌లో ప్రకటన విడుదల చేస్తామని బోర్డు వెల్లడించింది. ఇతర సోర్స్‌లను నమ్మవద్దని స్పష్టం చేసింది.

ఈ ఏడాది పరీక్షల వివరాలు:

పరీక్షల తేదీలు: ఫిబ్రవరి 15 నుంచి ఏప్రిల్‌ 4 వరకు

పరీక్ష కేంద్రాలు: దేశవ్యాప్తంగా 7,842 కేంద్రాలు

దశలవారీగా పరీక్షలు నిర్వహించిన దేశాలు: 26

10వ తరగతి విద్యార్థులు: 24.12 లక్షలు

12వ తరగతి విద్యార్థులు: 17.88 లక్షలు


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens