కేంద్ర ప్రభుత్వ కార్మిక, ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా నేడు దేశవ్యాప్తంగా భారత్ బంద్ జరుగుతోంది. ఈ బంద్లో 25 కోట్లకు పైగా కార్మికులు పాల్గొననున్నట్లు సంఘాలు తెలిపాయి.
పది ప్రధాన కార్మిక సంఘాలు, రైతు సంఘాలు కలిసి బంద్కు పిలుపునిచ్చాయి. బ్యాంకింగ్, రవాణా, విద్యుత్, పోస్టల్ వంటి ముఖ్య రంగాల సేవలు స్తంభించే అవకాశం ఉంది.
స్తంభించనున్న సేవలు:
-
బ్యాంకులు పూర్తిగా మూతపడే అవకాశం ఉంది. ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (AIBEA) బంద్కు మద్దతు తెలిపింది.
-
బొగ్గుగనులు, కర్మాగారాలు, పోస్టల్ సేవలు ఆగిపోవచ్చు.
-
విద్యుత్ రంగానికి చెందిన 27 లక్షల మంది ఉద్యోగులు పాల్గొనడం వల్ల కరెంట్ సరఫరాలో అంతరాయం కలగవచ్చు.
-
బస్సులు, ఆటోలు, ట్యాక్సీలు పలు నగరాల్లో రోడ్డుపై కనిపించకపోవచ్చు.
-
రైల్వే యూనియన్లు అధికారికంగా పాల్గొనకపోయినా, ట్రాక్ల వద్ద ఆందోళనలు జరిగే అవకాశం ఉంది.
-
పాఠశాలలు, కళాశాలలు యథావిధిగా కొనసాగుతాయి. సెలవు లేదు.
సమ్మెకు కారణాలు:
కార్మిక సంఘాల ప్రకారం, ఈ బంద్ ఈ క్రింది విషయాలకు వ్యతిరేకంగా జరుగుతోంది:
-
కార్మిక చట్టాల్లో మార్పులు (లేబర్ కోడ్లు)
-
ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ
-
ఉద్యోగాల్లో ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు విధానం
-
పెరుగుతున్న నిరుద్యోగం, ధరల పెరుగుదల
-
వేతనాల కోత
17 డిమాండ్ల సాధన కోసమే ఈ సమ్మె చేపడుతున్నట్లు కార్మిక సంఘాలు పేర్కొన్నాయి.
ఈ బంద్కు సంయుక్త కిసాన్ మోర్చా కూడా మద్దతు తెలిపినందున, గ్రామీణ ప్రాంతాల్లో పెద్దఎత్తున నిరసనలు జరుగే అవకాశం ఉంది.