Telangana

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాలు రేపు.. 10 రౌండ్లలో లెక్కింపు, మధ్యాహ్నానికే ఫలితం

జూబ్లీహిల్స్‌ నియోజకవర్గ ఉప ఎన్నిక ఫలితంపై నెలకొన్న ఉత్కంఠకు రేపటితో తెరపడనుంది. శుక్రవారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుండగా, ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. లెక్కింపు యూసుఫ్‌గూడలోని కోట్ల విజయభాస్కర్‌రెడ్డి స్టేడియంలో జరుగనుంది.

నియోజకవర్గంలోని 407 పోలింగ్‌ కేంద్రాల ఓట్లను మొత్తం 10 రౌండ్లలో లెక్కించనున్నారు. ఇందుకోసం అధికారులు 42 టేబుళ్లను సిద్ధం చేశారు. సాధారణంగా 14 టేబుళ్లను మాత్రమే ఉపయోగిస్తారు కానీ, ఈసారి ఉప ఎన్నిక కావడంతో మరియు సిబ్బంది అందుబాటులో ఉండటంతో లెక్కింపును వేగంగా పూర్తి చేయడానికి ఎక్కువ టేబుళ్లను ఏర్పాటు చేశారు. ప్రతి టేబుల్ వద్ద కౌంటింగ్ సిబ్బందితో పాటు అభ్యర్థి మరియు ఆయన ఏజెంట్‌కే ప్రవేశం ఉంటుంది.

లెక్కింపు ప్రక్రియ మొదట పోస్టల్ బ్యాలెట్లతో ప్రారంభమవుతుంది. 10 హోమ్ ఓటింగ్ బ్యాలెట్లు, 18 సర్వీసు ఓట్ల లెక్కింపుల అనంతరం ఈవీఎంల ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. ఉదయం 8:45 గంటలకే తొలి రౌండ్ ఫలితాలు వెలువడతాయని, మధ్యాహ్నం 12 గంటల కల్లా తుది ఫలితం తేలిపోతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

తుది పోలింగ్ శాతం 48.49 శాతం నమోదైంది. ఇది 2023 సాధారణ ఎన్నికల 47.58 శాతం కంటే 0.91 శాతం ఎక్కువగా ఉంది. ఫలితాల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కౌంటింగ్ కేంద్రం వద్ద మూడంచెల భద్రతా ఏర్పాట్లు చేశారు.


Today's Best Deals

Rs. 270.00

Emoji Expressions Matching Game

Rs. 480.00

Labubu Bunny Keychain

Rs. 100.00

Face Changing Keychain

Rs. 230.00

Busy Book