ఖాదీ, గ్రామీణ పరిశ్రమల బోర్డు ఉద్యోగులకు ఈహెచ్ఎస్ వైద్య సేవలు కొనసాగింపు
ఆంధ్రప్రదేశ్ ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమల బోర్డు ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. ఇకపై బోర్డు ఉద్యోగులందరికీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే ఈహెచ్ఎస్ (EHS) వైద్య సేవలు కొనసాగనున్నాయి.
ఈహెచ్ఎస్ సేవలు బోర్డు సభ్యులకు కూడా వర్తింపజేయాలన్న ప్రతిపాదనను బోర్డు సీఈఓ ప్రభుత్వంకి పంపగా, ప్రభుత్వం దానికి అంగీకారం తెలిపింది. ఈ నిర్ణయం ద్వారా ఉద్యోగులందరికీ ఉచితంగా వైద్య సేవలు లభించనున్నాయి.
ఈ నిర్ణయాన్ని అమలు చేయాలని పరిశ్రమలు మరియు వాణిజ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా అధికారిక ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఖాదీ బోర్డు ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.