tics International

విమాన ప్రమాదంపై భారత దర్యాప్తుకు సహకరిస్తామని బోయింగ్ సీఈఓ ప్రకటన

న్యూ ఢిల్లీ, జూన్ 12:
ఎయిర్ ఇండియా ఫ్లైట్ AI-171 ప్రమాదానికి సంబంధించి, బోయింగ్ ప్రెసిడెంట్ మరియు సీఈఓ కెల్లి ఓర్ట్బర్గ్ ఎయిర్ ఇండియా చైర్మన్ ఎన. చంద్రశేఖరన్‌ను ఫోన్‌లో సంప్రదించి, తమ సంస్థ పూర్తి సహకారం అందించేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు.

“ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ప్రయాణికులు, సిబ్బంది మరియు అహ్మదాబాద్ వాసుల కుటుంబాలకు మా ప్రగాఢ సానుభూతి,” అని ఓర్ట్బర్గ్ తన ట్వీట్‌లో తెలిపారు. బోయింగ్ సంస్థ, భారత్ ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) దర్యాప్తుకు పూర్తిగా సహకరిస్తుందని చెప్పారు.

పౌర విమానయాన శాఖ మంత్రి రామ్ మోహన్ నాయుడు మాట్లాడుతూ, ఈ ప్రమాదంపై అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ (ICAO) మార్గదర్శకాలకు అనుగుణంగా అధికారిక దర్యాప్తు ప్రారంభమైందని చెప్పారు. అలాగే, ఈ ఘటనపై లోతుగా పరిశీలించేందుకు అనేక రంగాల నిపుణులతో కూడిన హై లెవల్ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు.

ఎయిర్ ఇండియా సీఈఓ క్యాంప్‌బెల్ విల్సన్ మాట్లాడుతూ, ఇది ఎయిర్ ఇండియా కోసం ఒక కఠినమైన రోజు అని పేర్కొన్నారు. “ప్రయాణికులు, సిబ్బంది, వారి కుటుంబాలకు మేము అవసరమైన సాయం అందించేందుకు మా అన్ని ప్రయత్నాలు సాగిస్తున్నాము,” అని ఆయన వీడియో సందేశంలో చెప్పారు. లండన్‌కు బయలుదేరిన బోయింగ్ 787-8 డ్రిమ్‌లైనర్ విమానం, అహ్మదాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి టేక్ ఆఫ్ అయిన కొద్ది క్షణాల్లోనే అక్కడి ఇంటర్న్ డాక్టర్ల హాస్టల్ పైకి కూలిపోయింది.


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens