జూలై 1 నుంచి కొత్త నిబంధనలు: పాన్ కార్డు, తత్కాల్ టికెట్లు, బ్యాంకు ఛార్జీల్లో మార్పులు
పాన్ కార్డు దరఖాస్తు, తత్కాల్ టికెట్లకు ఆధార్ తప్పనిసరి
జూలై 1 నుంచి పాన్ కార్డు దరఖాస్తు చేసుకోవాలంటే ఆధార్ కార్డు తప్పనిసరిగా అవసరం. ఇప్పటివరకు ఇతర గుర్తింపు పత్రాలతో పాన్ కార్డు తీసుకునే అవకాశం ఉండేది. ఇకపై ఆధార్తో ధృవీకరణ లేకుండా కొత్త పాన్ కార్డు దరఖాస్తు చేయలేరు. ఇప్పటికే ఉన్నవారు డిసెంబర్ 31లోగా ఆధార్తో లింక్ చేయకపోతే పాన్ డి-యాక్టివేట్ అవుతుంది. రైల్వే తత్కాల్ టికెట్లు బుక్ చేయాలన్నా ఆధార్ తప్పనిసరి. జూలై 15 నుంచి అన్ని రైలు టికెట్లకు టూ-ఫ్యాక్టర్ అథెంటికేషన్ (OTP ద్వారా) విధానం అమలులోకి వస్తుంది. టికెట్ ధరలు కూడా కొంత పెరగనున్నాయి.
ఐటీఆర్ దాఖలుకు గడువు పెంపు – పన్ను చెల్లింపుదారులకు ఊరట
ఆదాయపు పన్ను రిటర్నుల (ITR) దాఖలుకు గడువును ప్రభుత్వం జూలై 31 నుంచి సెప్టెంబర్ 15 వరకు పొడిగించింది. దీని వల్ల ఉద్యోగులు మరియు చిన్న వ్యాపారులు తమ పన్ను రిటర్నులు సకాలంలో ఫైల్ చేసేందుకు మరింత సమయం దొరుకుతుంది.
క్రెడిట్ కార్డు ఛార్జీలు మారుతున్నాయి
ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ బ్యాంకులు తమ క్రెడిట్ కార్డు ఛార్జీల్లో మార్పులు చేస్తున్నాయి.
-
SBI: ఎలైట్ కార్డులపై ఎయిర్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ నిలిపివేస్తోంది. MAD లెక్కింపు విధానంలో మార్పులు.
-
HDFC: ఇంటి అద్దె లేదా స్కిల్ గేమ్లకు రూ.10,000 మించి ఖర్చు చేస్తే 1% ఫీజు వసూలు. డిజిటల్ వాలెట్లో రూ.10,000 పైగా లోడ్ చేసినా అదే ఫీజు వర్తిస్తుంది.
-
ICICI: ATM లావాదేవీలకు సర్వీస్ ఛార్జీలు పెరిగాయి. ఇతర బ్యాంకుల ATMల్లో ఉచిత లావాదేవీలు గరిష్టంగా 3-5 మాత్రమే. అంతర్జాతీయ ATM లావాదేవీలకు రూ.125 వరకు ఛార్జీలు. క్యాష్ డిపాజిట్లు అధిక మొత్తానికి అదనపు ఛార్జీలు అమలులోకి రానున్నాయి.