విశాఖపట్నంలో కాగ్నిజెంట్ భారీ క్యాంపస్ – 8,000 మందికి ఉద్యోగ అవకాశాలు

విశాఖపట్నంలో కాగ్నిజెంట్ ఐటీ క్యాంపస్ – 8,000 ఉద్యోగాలు వచ్చేనున్నాయి

విశాఖపట్నం ఐటీ రంగంలో కీలక ముందడుగు వేయబోతోంది. ప్రముఖ టెక్నాలజీ సంస్థ కాగ్నిజెంట్, నగరంలో కొత్త ఐటీ క్యాంపస్‌ను ఏర్పాటు చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ ప్రాజెక్టుతో వేలాది మంది యువతకు ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం ఉంది.

విశాఖపట్నం కాపులుప్పాడ ప్రాంతంలో కాగ్నిజెంట్ సుమారు 22 ఎకరాల విస్తీర్ణంలో ఆధునిక వసతులతో క్యాంపస్‌ను నిర్మించనుంది. ఈ కేంద్రం ప్రధానంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ సేవలపై దృష్టి పెట్టనుంది అని కంపెనీ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పేర్కొంది.

ఈ కొత్త క్యాంపస్‌ను 2026 నుండి ప్రారంభించేందుకు కంపెనీ ప్రణాళికలు రూపొందిస్తోంది. రాష్ట్రంలో ఈ ప్రాజెక్టుకు సహకరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్లకు కాగ్నిజెంట్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ ప్రాజెక్ట్ విశాఖ ఐటీ అభివృద్ధికి బలమిచ్చి, స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెంచుతుంది.


Today's Best Deals

Rs. 270.00

Emoji Expressions Matching Game

Rs. 480.00

Labubu Bunny Keychain

Rs. 100.00

Face Changing Keychain

Rs. 230.00

Busy Book