భారత–పాక్ ఉద్రిక్తతలతో CA ఫైనల్ పరీక్షలు వాయిదా – కొత్త షెడ్యూల్ త్వరలో విడుదల

భారత్-పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో CA 2025 పరీక్షలు వాయిదా

పహల్గాం ఘటనతో భారతదేశం ఆగ్రహంలో మండింది

పహల్గాం ఉగ్రదాడి యావత్ దేశాన్ని షాక్‌కు గురి చేసింది. ఈ దాడికి ప్రతిగా భారత సైన్యం 'ఆపరేషన్ సింధూర్' పేరుతో పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది. దీంతో పాక్ ఆర్మీ భారత్‌పై దాడికి యత్నించగా, ఇరుదేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ నేపథ్యంలో దేశంలో భద్రతా పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని CA ఫైనల్ పరీక్షలను వాయిదా వేయాల్సి వచ్చింది.

ICAI అధికారిక ప్రకటన

న్యూఢిల్లీ, మే 9: ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఛార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ICAI) తాజాగా ప్రకటించిన ప్రకారం, మే 9 నుంచి 14 వరకు జరగాల్సిన CA ఇంటర్మీడియట్‌, ఫైనల్‌, పోస్ట్ క్వాలిఫికేషన్ పరీక్షలు వాయిదా పడ్డాయి. భారత్‌, పాక్‌ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. పరీక్షల కొత్త షెడ్యూల్ త్వరలో ప్రకటించనున్నట్లు ICAI స్పష్టం చేసింది. విద్యార్థులు ICAI అధికారిక వెబ్‌సైట్ www.icai.org ను సందర్శించాలని సూచించింది.

షెడ్యూల్ వివరాలు మరియు ఆపరేషన్ సింధూర్

మూల షెడ్యూల్ ప్రకారం, మే 2 నుంచి 14 వరకు CA పరీక్షలు జరగాల్సి ఉంది. ఇంటర్ గ్రూప్ 1 పరీక్షలు మే 3, 5, 7 తేదీల్లో, గ్రూప్ 2 పరీక్షలు మే 9, 11, 14 తేదీల్లో జరగాల్సినవి. ఫైనల్ గ్రూప్ 1 పరీక్షలు ఇప్పటికే మే 2, 4, 6న జరిగాయి. గ్రూప్ 2 పరీక్షలు మే 8, 10, 13న జరగాల్సి ఉంది. ఇదే సమయంలో ఏప్రిల్ 22న జరిగిన పహల్గాం హత్యాకాండకు ప్రతిగా భారత సైన్యం మే 7న 'ఆపరేషన్ సింధూర్' ద్వారా పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసింది. కుప్వారా, బారాముల్లా, ఉరి, పూంచ్, మెంధార్, రాజౌరి ప్రాంతాల్లో జరిగిన కాల్పుల్లో 16 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. పాకిస్తాన్ జమ్మూ, పఠాన్‌కోట్, ఉధంపూర్‌లలోని సైనిక స్థావరాలపై దాడికి యత్నించగా, భారత్ డ్రోన్లు, క్షిపణులతో ఆ దాడులను ఎదుర్కొంది.


Today's Best Deals

Rs. 270.00

Emoji Expressions Matching Game

Rs. 480.00

Labubu Bunny Keychain

Rs. 100.00

Face Changing Keychain

Rs. 230.00

Busy Book