సెప్టెంబర్ 7న ‘బ్లడ్ మూన్’ అద్భుతం.. హైదరాబాద్ నుంచి వీక్షణం

సెప్టెంబర్ 7న అరుదైన రక్త చంద్రగ్రహణం – భారత్‌లోనూ వీక్షణం

ఖగోళ ప్రియులకు శుభవార్త. వచ్చే నెల సెప్టెంబర్ 7–8 తేదీల రాత్రి సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఈ సమయంలో చంద్రుడు ఎర్రటి నారింజ రంగులో మెరుస్తూ కనిపిస్తాడు. అందుకే దీనిని రక్త చంద్రగ్రహణం (Blood Moon) అని పిలుస్తారు. ఈ అద్భుత దృశ్యం దాదాపు 82 నిమిషాల పాటు కనువిందు చేయనుంది.

ఈ చంద్రగ్రహణం ఆసియా, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, ఐరోపా ఖండాల్లో స్పష్టంగా కనిపించనుంది. భారత్‌లో కూడా ఇది స్పష్టంగా కనిపించనుంది. ముఖ్యంగా హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, పుణె, లక్నో, చండీగఢ్ వంటి నగరాల ప్రజలు వాతావరణం అనుకూలిస్తే ఈ అద్భుతాన్ని వీక్షించవచ్చు.

చంద్రగ్రహణం సమయంలో చంద్రుడు ఎర్రగా ఎందుకు కనిపిస్తాడన్న సందేహం చాలామందికి ఉంటుంది. భూమి, చంద్రుడు, సూర్యుడు ఒకే రేఖలో వచ్చినప్పుడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఈ సమయంలో భూమి నీడ చంద్రుడిపై పడుతుంది. అయితే సూర్యకాంతి భూమి వాతావరణం గుండా ప్రయాణించేటప్పుడు నీలి కాంతి ఎక్కువగా చెదిరిపోతుంది, కేవలం ఎరుపు–నారింజ కాంతి మాత్రమే చంద్రుడిని చేరుతుంది. అందువల్ల చంద్రుడు ఎర్రటి వెలుగుతో కనిపిస్తాడు.

ఈ అరుదైన రక్త చంద్రగ్రహణాన్ని చూసేందుకు ఖగోళ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


Today's Best Deals

Rs. 270.00

Emoji Expressions Matching Game

Rs. 480.00

Labubu Bunny Keychain

Rs. 100.00

Face Changing Keychain

Rs. 230.00

Busy Book