ఏపీ పీజీసెట్ 2025 ప్రవేశ పరీక్ష షెడ్యూల్ విడుదల: ఏ పరీక్ష ఎప్పుడు ఉంటుందో తెలుసుకోండి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని యూనివర్సిటీలు మరియు వాటి అనుబంధ కాలేజీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించిన పోస్టుగ్రాడ్యుయేట్ కోర్సుల ప్రవేశానికి సంబంధించిన ఏపీ పీజీసెట్ 2025 నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఏడాది ఈ ప్రవేశ పరీక్షను తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ నిర్వహిస్తోంది. ఆన్‌లైన్ దరఖాస్తులు ఏప్రిల్ 2 నుంచి మే 5 వరకు స్వీకరించబడ్డాయి. అయితే, నోటిఫికేషన్‌లో పరీక్షల తేదీల వివరాలు ఇవ్వలేదు.

దీన్ని దృష్టిలో ఉంచుకుని, ఉన్నత విద్యా మండలి తాజాగా పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేసింది. తాజా షెడ్యూల్ ప్రకారం, ఆంధ్రప్రదేశ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (ఏపీ పీజీసెట్) 2025 జూన్ 9 నుంచి 12 వరకు ఆన్‌లైన్ విధానంలో ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం రెండు సెషన్లలో నిర్వహించబడుతుంది.

ఈ పరీక్ష ద్వారా ప్రవేశాలు ఇస్తున్న యూనివర్సిటీల జాబితా:

  • ఆంధ్ర యూనివర్సిటీ (విశాఖపట్నం)

  • డా.బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ (శ్రీకాకుళం)

  • శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ (తిరుపతి)

  • డా.అబ్దుల్ హక్ ఉర్దూ యూనివర్సిటీ (కర్నూలు)

  • శ్రీ కృష్ణదేవరాయ యూనివర్సిటీ (అనంతపురం)

  • ద్రవిడియన్ యూనివర్సిటీ (కుప్పం)

  • ఆచార్య నాగార్జున యూనివర్సిటీ (గుంటూరు)

  • కృష్ణ యూనివర్సిటీ (మచిలీపట్నం)

  • శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం (తిరుపతి)

  • ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ (రాజమహేంద్రవరం)

  • యోగి వేమన యూనివర్సిటీ (కడప)

  • క్లస్టర్ యూనివర్సిటీ (కర్నూలు)

  • రాయలసీమ యూనివర్సిటీ (కర్నూలు)

  • ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం యూనివర్సిటీ (ఒంగోలు)

  • విక్రమ సింహపురి యూనివర్సిటీ (నెల్లూరు)

  • జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ అనంతపూర్ – ఆయిల్ టెక్నలాజికల్ అండ్ ఫార్మాస్యూటికల్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్

  • శ్రీ వెంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (తిరుపతి)

ఏపీ పీజీసెట్ 2025 పరీక్షల షెడ్యూల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

రాష్ట్రవ్యాప్తంగా సుమారు 17 యూనివర్సిటీలు, వాటి అనుబంధ పీజీ కాలేజీల్లో 150కి పైగా పీజీ కోర్సుల్లో ఈ ప్రవేశ పరీక్షలో వచ్చిన ర్యాంకుల ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. అందుబాటులో ఉన్న సీట్లలో 85% సీట్లు స్థానిక విద్యార్థులకు కేటాయించబడతాయి.


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens