tics National

తిరుమల లడ్డూ నకిలీ నెయ్యి వివాదం – హైకోర్టులో సీబీఐ కీలక వాదనలు

తిరుమల లడ్డూ నకిలీ నెయ్యి కేసు: హైకోర్టులో సీబీఐ విచారణ

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ప్రసాదంగా ఇచ్చే ప్రసిద్ధమైన లడ్డూల తయారీలో నకిలీ నెయ్యిని ఉపయోగించినట్టు సీబీఐ హైకోర్టులో వెల్లడించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా భోలేబాబా డెయిరీను సీబీఐ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) గుర్తించింది.

టీటీడీ బ్లాక్‌లిస్టులో ఉన్న భోలేబాబా డెయిరీ, ఏఆర్ డెయిరీ మరియు వైష్ణవి డెయిరీలను ముసుగుగా ఉపయోగించి, పామాయిల్ మరియు రసాయనాలతో కల్తీ చేసిన నెయ్యిని సరఫరా చేసినట్లు విచారణలో తేలింది. ఇది పక్కా ప్రణాళికతో జరిగిన మోసమని సీబీఐ న్యాయవాది పీఎస్‌పీ సురేష్ కుమార్ వెల్లడించారు.

వాట్సాప్ గ్రూప్ చాట్స్‌ ఆధారంగా నిందితుల ముద్రలు గుర్తించబడినట్లు తెలిపారు. దర్యాప్తును ప్రభావితం చేయడానికీ, సాక్షులను బెదిరించడానికీ నిందితులు ప్రయత్నిస్తున్నారని సీబీఐ ఆరోపించింది.

కీ సాక్షి సంజీవ్ జైన్‌పై దాడి చేసి బెదిరించారని, అలాగే అశిష్ రోహిల్లా పేరు మీద నకిలీ పిటిషన్ హైకోర్టులో దాఖలయ్యిందని కోర్టుకు వెల్లడించారు. ఈ పరిస్థితుల్లో నిందితులకు బెయిల్ మంజూరు చేయవద్దని, దర్యాప్తు దిశ తప్పే ప్రమాదం ఉందని సీబీఐ వాదించింది.

నిందితుల తరఫున సీనియర్ న్యాయవాదులు సీవీ మోహన్‌రెడ్డి మరియు ఎస్. శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ, వారి క్లయింట్లు నాలుగు నెలలుగా జైలులో ఉన్నారని, దర్యాప్తు పూర్తయ్యిందని పేర్కొన్నారు. ఆరోపణలు పూర్తిగా నిరూపించబడలేదని, ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నాయని వారు వాదించారు.

బెయిల్ కోరిన నిందితులు:

రాజు రాజశేఖరన్ (ఏఆర్ డెయిరీ ఎండీ)

పొమిల్ జైన్, విపిన్ జైన్ (భోలేబాబా డెయిరీ డైరెక్టర్లు)

అపూర్వ వినయ్‌కాంత్ చావడా (వైష్ణవి డెయిరీ సీఈఓ)


ఇరుపక్షాల వాదనలు విన్న జస్టిస్ టీసీడీ శేఖర్, తదుపరి విచారణను జూన్ 17, 2025కి వాయిదా వేశారు.


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens