తెలంగాణ పాలిసెట్ 2025 పరీక్ష రేపు: ఒక్క నిమిషం ఆలస్యమైనా ప్రవేశం లేదు!

తెలంగాణ పాలిసెట్‌ 2025 ప్రవేశ పరీక్ష మంగళవారం, మే 13న జరుగనుంది. 2025-26 విద్యా సంవత్సరానికి పాలిటెక్నిక్‌ (డిప్లొమా) కోర్సుల్లో ప్రవేశానికి ఈ పరీక్షను రాష్ట్ర సాంకేతిక విద్య మండలి (SBTET) నిర్వహిస్తోంది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 వరకు రాష్ట్రవ్యాప్తంగా 276 పరీక్ష కేంద్రాల్లో ఈ పరీక్ష జరగనుంది. మొత్తం 1,06,716 మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరుకానున్నారు.

పరీక్ష కేంద్రానికి గంట ముందే వచ్చేయాలి. ఒక నిమిషం ఆలస్యం అయినా పరీక్ష హాలులోకి అనుమతి ఉండదని అధికారులు హెచ్చరిస్తున్నారు. విద్యార్థులు సెంటర్ వివరాలు తెలుసుకోవడానికి "SBTET TG App" డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. హాల్‌ టికెట్లు అధికారిక వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

జేఈఈ అడ్వాన్స్‌డ్‌ 2025 అడ్మిట్‌ కార్డులు కూడా విడుదలయ్యాయి. మే 18న జాతీయస్థాయిలో జరిగే ఈ పరీక్ష కోసం ఐఐటీ కాన్పూర్‌ మే 12 నుంచి 18 వరకు అడ్మిట్‌ కార్డులను అందుబాటులో ఉంచుతోంది. ఈ పరీక్ష రెండు పేపర్లుగా నిర్వహిస్తారు — పేపర్‌ 1 ఉదయం 9 నుంచి 12 వరకు, పేపర్‌ 2 మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 వరకు జరుగుతుంది. జేఈఈ మెయిన్స్‌ లో అర్హత పొందిన మొదటి 2.5 లక్షల మంది విద్యార్థులకే ఈ పరీక్ష రాయేందుకు అవకాశం ఉంటుంది.


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens