జైపూర్లో ఐపీఎల్ ఉత్కంఠభరిత పోరు – సచిన్ రికార్డును బ్రేక్ చేసిన సూర్యకుమార్!
సోమవారం జైపూర్ వేదికగా జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ (PBKS) మరియు ముంబయి ఇండియన్స్ (MI) జట్లు తలపడినాయి. పాయింట్ల పట్టికలో టాప్-2 స్థానం కోసం జరిగిన ఈ కీ పోరులో ముంబయిని పంజాబ్ కింగ్స్ ఓడించింది. శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో ఆల్రౌండ్ ప్రదర్శనతో పంజాబ్ టేబుల్ టాపర్గా ఎదిగింది.
ఈ మ్యాచ్లో ముంబయి స్టార్ బ్యాట్స్మన్ సూర్యకుమార్ యాదవ్ మరోసారి అద్భుతంగా రాణించాడు. 39 బంతుల్లో 57 పరుగులు చేసి తన క్లాస్ను మరోసారి చాటిచెప్పాడు. ఈ సందర్భంగా ఆయన సచిన్ టెండూల్కర్ యొక్క 15 ఏళ్ల పురాతన రికార్డును చెరిపేశాడు. 2010లో సచిన్ ముంబయి తరఫున 618 పరుగులు చేసినా, ఇప్పుడు సూర్యకుమార్ అదే జట్టు తరఫున 628 పరుగులతో ఆ రికార్డును అధిగమించాడు.
మ్యాచ్ విషయానికి వస్తే, ముంబయి ఇండియన్స్ తొలుత బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 184 పరుగులు చేసింది. 185 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ 18.3 ఓవర్లలో కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని సాధించింది. పంజాబ్ బ్యాటర్లలో ఓపెనర్ ప్రియాంశ్ ఆర్య 62 పరుగులు, జోష్ ఇంగ్లిస్ 73 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్లతో జట్టుకు విజయం అందించారు.
పంజాబ్ 7 వికెట్ల తేడాతో ముంబయిని ఓడించి టాప్ స్థానానికి దూసుకెళ్లింది.