స్కైప్: ఇక స్కైప్ అందుబాటులో ఉండదు!

మైక్రోసాఫ్ట్ మే 5 నుండి స్కైప్ సర్వీసులను నిలిపివేయాలని ప్రకటించింది

మైక్రోసాఫ్ట్ మే 5 నుండి స్కైప్ సర్వీసులను నిలిపివేయాలని ప్రకటించింది. స్కైప్ యూజర్లను Microsoft Teams వైపు మళ్లించేందుకు చర్యలు తీసుకుంటూ, Teams ప్లాట్‌ఫారమ్ మరింత ఆధునిక మరియు సమగ్ర అనుభవాన్ని అందించడంపై దృష్టి పెట్టింది. మైక్రోసాఫ్ట్, Skypeతో పోలిస్తే Teams మరింత మెరుగైన అనుభవాన్ని అందిస్తుందని స్పష్టం చేసింది.

సుమారు రెండు దశాబ్దాలుగా వీడియో కాలింగ్ సేవలను అందించిన స్కైప్, కరోనా సమయంలో ఎక్కువగా ప్రాచుర్యం పొందింది. ఆ సమయంలో చాలా మంది ఉద్యోగులు, వ్యాపార సంస్థలు స్కైప్ సేవలను విరివిగా ఉపయోగించాయి. అయితే, కరోనా తర్వాత యూజర్ల ఆదరణ తగ్గిపోయింది, మరియు మార్కెట్లో మెరుగైన ప్రత్యామ్నాయ సేవలు అందుబాటులోకి వచ్చాయి. దీంతో, మైక్రోసాఫ్ట్, Skype సేవలను నిలిపివేయాలని నిర్ణయించుకుంది.

Microsoft Teams, Office 365 భాగంగా, ఇప్పుడు మెసేజింగ్, వీడియో కాల్స్ వంటి సర్వీసుల కోసం మైక్రోసాఫ్ట్ ప్రాధాన్యమైన వేదికగా మారింది. స్కైప్ యూజర్లను Teams లో చేరాలని మైక్రోసాఫ్ట్ కొంతకాలంగా ప్రోత్సహిస్తోంది. ఈ మార్పుకు యూజర్లకు క్రమంగా సమయం ఇవ్వడంతో పాటు, చాట్ హిస్టరీలు మరియు కాంటాక్ట్‌లను Teamsకు సులభంగా బదిలీ చేయడాన్ని హామీ ఇచ్చింది.


Today's Best Deals

Rs. 270.00

Emoji Expressions Matching Game

Rs. 480.00

Labubu Bunny Keychain

Rs. 100.00

Face Changing Keychain

Rs. 230.00

Busy Book