నేటి నుంచి భూమి చల్లబడుతుందా? సోషల్ మీడియా వార్తలపై శాస్త్రవేత్తల స్పష్టం
సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతోంది. దాని ప్రకారం, అఫెలియన్ (Aphelion) కారణంగా భూమి నేడు నుంచి గణనీయంగా చల్లబడుతుందని, ప్రజలు జలుబు, గొంతు నొప్పి, దగ్గు వంటి సమస్యలు ఎదుర్కోవచ్చని చెబుతున్నారు.
సాధారణంగా భూమి సూర్యుడికి సగటు దూరం 149.6 మిలియన్ కిలోమీటర్లు. అఫెలియన్ సమయంలో ఈ దూరం కేవలం 3% పెరిగి 152 మిలియన్ కిలోమీటర్ల అవుతుంది. సోషల్ మీడియాలో ఈ చిన్న దూరం తేడా వల్లే భూమి చల్లబడుతుందని తప్పుడు ప్రచారం జరుగుతోంది.
కానీ, ఈ వార్తలకు శాస్త్రీయ ఆధారాలు లేవు అని నిపుణులు స్పష్టం చేశారు. భారత వాతావరణ శాఖ మాజీ శాస్త్రవేత్త డా. రమేశ్ గుప్తా మాట్లాడుతూ – "అఫెలియన్ అనేది సహజ పరిణామం మాత్రమే. ఇది గణనీయమైన ఉష్ణోగ్రత మార్పులకు కారణం కాదు. ఈ ఏడాది అఫెలియన్ ఇప్పటికే జూలై 5న జరిగింది. ప్రస్తుతం భూమి మళ్లీ సూర్యునికి దగ్గరవుతోంది" అని చెప్పారు.
భూమి యొక్క 23.5° అక్ష వాలుదల వలననే ఋతువులు, వాతావరణ మార్పులు సంభవిస్తాయని, సూర్యుడికి దూరం కంటే ఇది ప్రధాన కారణమని శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు.
అందువల్ల ప్రజలు సోషల్ మీడియా తప్పుడు ప్రచారాలను నమ్మకుండా, అధికారిక వాతావరణ సంస్థల సమాచారం మీదే ఆధారపడాలని నిపుణులు సూచిస్తున్నారు.