PM Internship Scheme 2025: నిరుద్యోగ యువతకు లక్షకుపైగా PM ఇంటర్న్‌షిప్‌ అవకాశాలు.. అర్హులైన వారు ఎవరు?

ప్రధానమంత్రి ఇంటర్న్‌షిప్ పథకం (PMIS) 2025 కింద ఈ ఏడాదికి దేశ యువతకు దాదాపు 1 లక్ష ఇంటర్న్‌షిప్‌లు అందించబోతుంది. ఈ ఇంటర్న్‌షిప్‌లను దేశంలోని టాప్ 500 కంపెనీలతో ఏడాది పాటు అందించనున్నారు. మొత్తం ఐదేళ్లలో 10 లక్షల మందికి ఇంటర్న్‌షిప్‌లను ఇవ్వాలని కేంద్రం ప్రణాళిక రూపొందించింది.

PMIS 2025 పథకం ద్వారా యువతకు కొత్త నైపుణ్యాలు నేర్పించి ఉపాధి అవకాశాలు కల్పించడం లక్ష్యంగా ఉంది. ఇందుకు సంబంధించి ఈ ఏడాదికి PM Internship Scheme 2025 నోటిఫికేషన్ విడుదలైంది. ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్లు మొదలయ్యాయి. 300 పైగా కంపెనీలలో 1 లక్షకు పైగా ఇంటర్న్‌షిప్‌ అవకాశాలు ఉన్నాయి. 2025 మార్చి 12వ తేదీ వరకు ఆన్‌లైన్ దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది.

ఈ ఇంటర్న్‌షిప్‌కు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు తమ పేర్లను వెబ్‌సైట్ లో నమోదు చేసి తర్వాత దరఖాస్తు చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ కు ఏమీ ఫీజు లేదు. ఈ పథకంలో 21 నుంచి 24 ఏళ్ల మధ్య వయసున్న యువతీ యువకులు అర్హులవుతారు. 10వ తరగతి, ITI, పాలిటెక్నిక్, BA, BSc, BCA, BBA, BPharm వంటి డిగ్రీలు కలిగిన వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

అయితే, ప్రభుత్వ ఉద్యోగులు ఉన్న కుటుంబాల వారు, సంవత్సరానికి ₹8 లక్షలు మించి ఆదాయం పొందే కుటుంబాలు, అలాగే IIT, IIM వంటి ఉన్నత విద్యా సంస్థలలో చదివిన వారు ఈ పథకానికి అర్హులైన వారు కావద్దు.

ఈ పథకంలో ఎంపికైన అభ్యర్థులకు నెలకి ₹5,000 చొప్పున స్టైపెండ్ అందించబడుతుంది. అంతేకాక, ₹6,000 వన్‌టైమ్ గ్రాంట్ కూడా ఉంటుంది. అంటే, మొత్తం ఏడాదికి ₹66,000 వరకు స్టైపెండ్‌ ఇవ్వబడుతుంది.

పథకంలో భాగస్వామ్య కంపెనీలు ఏడాది పాటు ఇంటర్న్‌షిప్‌లు అందిస్తాయి. అభ్యర్థులు 6 నెలలు తరగతి గదిలో మరియు మరొక 6 నెలలు ఉద్యోగ వాతావరణంలో గడపాల్సి ఉంటుంది.

ఈ ఇంటర్న్‌షిప్‌లో భాగస్వాములైన వారు పర్సనల్ ఇన్సూరెన్స్ పొందుతారు. పీఎం జీవన్ జ్యోతి బీమా యోజన, పీఎం సురక్షా బీమా యోజన వంటి కేంద్ర ప్రభుత్వ బీమా పథకాల ద్వారా బీమా సౌకర్యం కల్పించబడుతుంది.


Today's Best Deals

Rs. 270.00

Emoji Expressions Matching Game

Rs. 480.00

Labubu Bunny Keychain

Rs. 100.00

Face Changing Keychain

Rs. 230.00

Busy Book