ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 2025-26 విద్యా సంవత్సరానికి 3 సంవత్సరాల LLB, 5 సంవత్సరాల LLB, 2 సంవత్సరాల LLM పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం లాసెట్-2025 పరీక్ష జూన్ 5న నిర్వహించనున్నారు. ఈ పరీక్ష శ్రీపద్మావతి మహిళా యూనివర్సిటీ ఆధ్వర్యంలో జరుగుతుందని సెట్ చైర్పర్సన్ ప్రొఫెసర్ వి ఉమ తెలిపారు.
పరీక్ష జూన్ 5 ఉదయం 9 గంటల నుండి 10:30 వరకు ఆన్లైన్ విధానంలో రాష్ట్ర వ్యాప్తంగా అనేక కేంద్రాల్లో జరుగుతుంది. మొత్తం 27,253 మంది అభ్యర్థులు ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 133 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని సెట్ కన్వీనర్ సీతాకుమారి తెలిపారు.
పరీక్ష తర్వాత జూన్ 16న తుది కీ విడుదల చేస్తారు. ఫలితాలను జూన్ చివరి వారంలో విడుదల చేయనున్నారు. లాసెట్ ప్రశ్నాపత్రం తెలుగు, ఇంగ్లీష్ మాధ్యమాల్లో అందుబాటులో ఉంటుంది.
ఆంధ్రప్రదేశ్ లాసెట్ 2025 అడ్మిట్ కార్డు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
https://cets.apsche.ap.gov.in/LAWCET/LAWCET/LAWCET_HomePage.aspx
తెలంగాణ సమాచారం:
తెలంగాణలో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించిన లాసెట్ 2025 హాల్ టికెట్లు విడుదలయ్యాయి. రాష్ట్రంలోని లా కాలేజీల ప్రవేశాల కోసం నిర్వహించే ఈ పరీక్ష ఈ నెల మొదటి వారంలో జరుగుతుంది. హాల్ టికెట్లు ఉన్నత విద్యా మండలి ద్వారా విడుదల చేయబడ్డాయి.
దరఖాస్తు చేసిన అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ https://lawcet.tgche.ac.in/ లో తమ రిజిస్ట్రేషన్ నంబర్, మొబైల్ నంబర్, పుట్టిన తేదీ వివరాలు నమోదు చేసి అడ్మిట్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
పరీక్ష జూన్ 6న రాష్ట్రంలోని పలు కేంద్రాల్లో జరుగుతుంది. ర్యాంకుల ఆధారంగా 3 సంవత్సరాల LLB, 5 సంవత్సరాల LLB, 2 సంవత్సరాల LLM కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.