భారత పార్లమెంట్: కేంద్రం కీలక నిర్ణయం... ఇకపై ఎంపీల జీతం ఎంతంటే...!

ఎంపీల జీతాలు పెంపు – కేంద్రం కొత్త నోటిఫికేషన్ విడుదల

కేంద్ర ప్రభుత్వం ఎంపీల జీతాలు, భత్యాలు, పింఛన్లను పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సోమవారం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. 2023 ఏప్రిల్ 1 నుండి ఈ పెరిగిన వేతనాలు అమలులోకి వస్తాయని వెల్లడించింది.

ఎంపీలకు పెరిగిన వేతనాలు & భత్యాలు:

  • ఎంపీ జీతం: రూ.1,00,000 నుండి రూ.1,24,000కు పెంపు.

  • రోజువారీ భత్యం: రూ.2,000 నుండి రూ.2,500కు పెంపు.

  • మాజీ ఎంపీల పింఛన్: రూ.25,000 నుండి రూ.31,000కి పెంచారు.

  • అదనపు పింఛన్: ఐదేళ్ల సర్వీసు తర్వాత ప్రతి సంవత్సరానికి రూ.2,000 నుండి రూ.2,500కి పెంపు.

పార్లమెంటు బడ్జెట్ సమావేశాల సమయంలోనే ఈ పెంపు ప్రకటన వెలువడటం గమనార్హం. గత సవరణ 2018లో జరిగింది, ఆ సమయంలో ద్రవ్యోల్బణం, జీవన వ్యయం పెరుగుదలను దృష్టిలో పెట్టుకుని ఎంపీల మూల వేతనాన్ని నిర్ణయించారు.

ఎంపీలకు అదనపు ప్రయోజనాలు:

  • ₹70,000 నియోజకవర్గ భత్యం – కార్యాలయ నిర్వహణ & ఓటర్ల సంబంధాల కోసం.

  • ₹60,000 కార్యాలయ నిర్వహణ భత్యం.

  • పార్లమెంటరీ సమావేశాల్లో రోజుకు ₹2,500 భత్యం.

  • 34 ఉచిత దేశీయ విమాన ప్రయాణాలు (కుటుంబ సభ్యులకు కూడా వర్తిస్తుంది).

  • ఎప్పుడైనా ఫస్ట్-క్లాస్ రైలు ప్రయాణం ఉచితం.

  • రోడ్డు ప్రయాణాలకు మైలేజ్ అలవెన్స్ కూడా అందుబాటులో ఉంటుంది.

  • ఉచితంగా 50,000 యూనిట్ల విద్యుత్, 4,000 కిలోల నీరు ప్రతి సంవత్సరం.

  • ఢిల్లీ లో ప్రభుత్వ హౌసింగ్ సదుపాయం (అద్దె లేని వసతి – హాస్టల్ గది, అపార్ట్‌మెంట్ లేదా బంగ్లా).

  • అధికారిక హౌసింగ్ ఉపయోగించకుంటే గృహ అద్దె భత్యం అందుబాటులో ఉంటుంది.


Today's Best Deals

Rs. 270.00

Emoji Expressions Matching Game

Rs. 480.00

Labubu Bunny Keychain

Rs. 100.00

Face Changing Keychain

Rs. 230.00

Busy Book