లండన్‌లో గాంధీ విగ్రహం ధ్వంసం: భారత్ తీవ్రంగా ఖండించింది

లండన్ టవిస్టాక్ స్క్వేర్‌లో గాంధీ విగ్రహం ధ్వంసం

మహాత్మా గాంధీ జయంతి వేడుకలకు ప్రపంచం సిద్ధమవుతున్న వేళ, లండన్‌లోని ప్రసిద్ధ టవిస్టాక్ స్క్వేర్‌లో గాంధీ విగ్రహానికి ఘోర అవమానం జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు సోమవారం ఈ విగ్రహాన్ని ధ్వంసం చేశారు, దీని ద్వారా పెద్ద కలకలం రేకింది. అక్టోబర్ 2న జరగనున్న గాంధీ జయంతి ఉత్సవాల ముందు ఈ ఘటన చోటుచేసుకోవడం తీవ్ర ఖండనకు కారణమైంది. లండన్‌లోని భారత హైకమిషన్ దీన్ని “సిగ్గుచేటిన చర్య”గా, అహింసా సిద్ధాంతంపై దాడి అని పేర్కొంది.

ధ్యానముద్రలో కూర్చుని ఉన్న విగ్రహ పీఠంపై దుండగులు భారత వ్యతిరేక రాతలు రాశారు. భారత హైకమిషన్ ఈ ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. “ఇది కేవలం విగ్రహాన్ని ధ్వంసం చేయడం కాదు, అంతర్జాతీయ అహింసా దినోత్సవానికి మూడు రోజుల ముందు అహింసా వారసత్వంపై జరిగిన హింసాత్మక దాడి. స్థానిక అధికారుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లాము. విగ్రహాన్ని తిరిగి పూర్వ వైభవానికి తీసుకురావడానికి మా బృందం ఇప్పటికే అధికారులతో కలిసి పనిచేస్తోంది” అని హైకమిషన్ ఒక ప్రకటనలో పేర్కొంది.

విషయం తెలుసుకున్న వెంటనే భారత దౌత్యవేత్తలు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. విగ్రహ పునరుద్ధరణ పనులను పర్యవేక్షిస్తున్నారు. మెట్రోపాలిటన్ పోలీస్ మరియు కామ్డెన్ కౌన్సిల్ అధికారులు దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు.

లండన్‌లో గాంధీ న్యాయ విద్య అభ్యసించిన యూనివర్సిటీ కాలేజీ సమీపంలో 1968లో ఈ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఐక్యరాజ్యసమితి అక్టోబర్ 2వ తేదీని 'అంతర్జాతీయ అహింసా దినోత్సవం'గా ప్రకటించింది. ప్రతి ఏటా విగ్రహానికి పూలమాలలు వేసి, గాంధీజీకి ఇష్టమైన భజనలతో నివాళులు అర్పించడం ఆనవాయితీగా ఉంది. ప్రాంగణంలోనే హిరోషిమా బాంబు బాధితుల స్మారకార్థం చెర్రీ చెట్టు మరియు ఇతర శాంతి స్మారకాలు ఉన్నాయి. ఇలాంటి శాంతి ప్రాంగణంలో జరిగిన విధ్వంసం గమనార్హం.


Today's Best Deals

Rs. 270.00

Emoji Expressions Matching Game

Rs. 480.00

Labubu Bunny Keychain

Rs. 100.00

Face Changing Keychain

Rs. 230.00

Busy Book