ఎంపికైన అభ్యర్థుల జాబితాను ప్రకటించిన ఏపీపీఎస్సీ
ఫలితాలను అధికారిక వెబ్సైట్లో ఉంచామన్న కమిషన్
ఈ నెల 17న అర్హత సాధించిన వారికి ధ్రువపత్రాల పరిశీలన జరుగుతుందన్న కమిషన్
ఆంధ్రప్రదేశ్లో జూనియర్ లెక్చరర్ (జేఎల్) ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో కీలక ముందడుగు పడింది. జేఎల్ నియామకాలకు సంబంధించిన రాత పరీక్ష ఫలితాలను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) నిన్న విడుదల చేసింది. ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను అధికారికంగా ప్రకటించింది.
ఫలితాల కోసం అభ్యర్థులు ఏపీపీఎస్సీ అధికారిక వెబ్సైట్ను సందర్శించి తమ వివరాలను చూసుకోవచ్చని అధికారులు తెలిపారు. రాత పరీక్షలో అర్హత సాధించి ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు డిసెంబర్ 17న ధ్రువపత్రాల పరిశీలన (సర్టిఫికెట్ వెరిఫికేషన్) నిర్వహించనున్నట్లు ఏపీపీఎస్సీ ప్రకటించింది.
ఈ ప్రక్రియకు సంబంధించి ఇప్పటికే అభ్యర్థులకు కాల్ లెటర్లు పంపినట్లు కమిషన్ పేర్కొంది. ఒకవేళ ఎవరికైనా కాల్ లెటర్లు అందకపోతే, వారు ఏపీపీఎస్సీ వెబ్సైట్ నుంచి నేరుగా డౌన్లోడ్ చేసుకోవచ్చని సూచించింది.
అభ్యర్థులు తదుపరి దశలకు సంబంధించిన అప్డేట్స్ కోసం అధికారిక వెబ్సైట్ను క్రమం తప్పకుండా పరిశీలించాలని అధికారులు సూచించారు.