నేడు పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు
- 25న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పాటవుతుంది
- 27నాటికి వాయుగుండంగా బలపడే అవకాశం
- రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే సూచనలు
ఆంధ్రప్రదేశ్లో వర్షాలు ఊపందుకున్నాయి. ద్రోణి ప్రభావం, బంగాళాఖాతంలో ఏర్పడబోయే అల్పపీడనం కారణంగా రాష్ట్రంలో రాబోయే రోజుల్లో విస్తారమైన వర్షాలు కురిసే అవకాశం ఉంది.
విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకారం, నేడు రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో వర్షాలు కురుస్తాయి. ముఖ్యంగా కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. రైతులు, కూలీలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
మరోవైపు, 25న తూర్పు-మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి, 27 నాటికి అది వాయుగుండంగా బలపడవచ్చని ఐఎండీ తెలిపింది. ఇది ఒడిశా తీరానికి సమీపించవచ్చని అంచనా.
ఈ ప్రభావంతో సెప్టెంబర్ 23 నుంచి అక్టోబర్ 2 వరకు ఉత్తర కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశముందని వాతావరణ మోడళ్లు చెబుతున్నాయి.
వర్షపాతం వివరాలు (20 సెప్టెంబర్ సాయంత్రం వరకు):
- ఇందుకూరుపేట (నెల్లూరు) – 97.7 మి.మీ.
- తిరుపతి – 77.7 మి.మీ.
- కార్వేటినగర్ (చిత్తూరు) – 73.5 మి.మీ.