2023 బ్యాచ్కు చెందిన ఏడుగురు ఐఏఎస్ ప్రొబేషన్ అధికారులను ఏపీ ప్రభుత్వం వివిధ జిల్లాల్లో సబ్ కలెక్టర్లుగా నియమించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. వీరంతా ఈ నెల 11న విధుల్లో చేరాలని పేర్కొన్నారు.
మదనపల్లెకు చల్లా కల్యాణి, కందుకూరుకు దామెర హిమవంశీ, పాలకొండకు పవార్ స్వప్నిక్ జగన్నాథ్, నూజివీడుకు బొల్లిపల్లి వినూత్న నియమితులయ్యారు. అలాగే, రాజంపేటకు హెచ్.ఎస్. భావన, రంపచోడవరంకు శుభం నొఖ్వాల్, పార్వతీపురానికి ఆర్. వైశాలి నియమితులయ్యారు.
ప్రస్తుతంగా ఆయా ప్రాంతాల్లో పని చేస్తున్న సబ్ కలెక్టర్లను ఇతర చోటులకు బదిలీ చేశారు. 2023 బ్యాచ్ అధికారుల రెండో దశ శిక్షణ అనంతరం ఈ నియామకాలు జరగడం గమనార్హం.