tics Andhra Pradesh

టీటీడీ: శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శన సమయాల్లో మార్పు

తిరుమల వీఐపీ బ్రేక్ దర్శన సమయాల్లో మార్పు – నేటి నుంచి అమలు

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వీఐపీ బ్రేక్ దర్శన సమయాల్లో మార్పు చేసినట్లు ప్రకటించింది. ఈ కొత్త సమయాలు నేటి నుంచి ప్రయోగాత్మకంగా అమలులోకి వస్తాయి. డిప్యూటీ ఈఓ లోకనాథం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ఉదయం 5:45 గంటల నుంచి 11:00 గంటల వరకు బ్రేక్ దర్శనం కొనసాగుతుంది. అయితే గురువారం (తిరుప్పావడ సేవ) మరియు శుక్రవారం (అభిషేక సేవ) రోజులలో పాత సమయాల ప్రకారమే దర్శనం జరుగుతుంది.

కొత్త షెడ్యూల్ ప్రకారం:

  • ఉదయం 5:45 – ప్రొటోకాల్ దర్శనం

  • 6:30 – రిఫరల్ ప్రొటోకాల్

  • 6:45 – జనరల్ బ్రేక్ దర్శనం

  • 10:15 – శ్రీవాణి (ఆన్‌లైన్ & ఆఫ్‌లైన్)

  • 10:30 – దాతలు

  • 11:00 – టీటీడీ రిటైర్డ్ ఉద్యోగులు

గురువారం, శుక్రవారం ఉదయం 8 గంటలకు బ్రేక్ దర్శనం ప్రారంభమవుతుంది. భక్తులు ఈ మార్పులను గమనించి, తగిన విధంగా తమ దర్శనాన్ని ప్లాన్ చేసుకోవాలని టీటీడీ సూచించింది.


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens