నదీజలాల్లో తెలంగాణకు న్యాయం జరగాల్సిందే: సీఎం రేవంత్ రెడ్డి

గోదావరి-కృష్ణా జలాల్లో తెలంగాణ హక్కులపై రాజీ లేదు – సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు – గోదావరి మరియు కృష్ణా నదీజలాల్లో తెలంగాణకు రావలసిన న్యాయమైన వాటాపై ఏ విధంగానూ రాజీ చేయబోమని. రాష్ట్ర హక్కుల కోసం రాజకీయంగానూ, చట్టపరంగానూ పోరాడతామని తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదించిన గోదావరి–బనకచెర్ల ప్రాజెక్టుపై నిర్వహించిన ప్రెజెంటేషన్ సందర్భంగా మాట్లాడిన సీఎం రేవంత్, మాజీ సీఎం కేసీఆర్ మరియు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. 2015లో జరిగిన సమావేశంలో, కృష్ణా-గోదావరి జలాల వినియోగంపై అన్యాయ ఒప్పందాలు చేయడమే ఈ-day జల వివాదానికి కారణమని ఆరోపించారు.

హరీష్ రావును అసెంబ్లీలో రెండు రోజుల పాటు చర్చకు రావాలని సవాల్ చేశారు. రాష్ట్రానికి న్యాయం జరగాలంటే కేంద్రం సహకరించాల్సిన బాధ్యత ఉన్నదని చెప్పారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బీఆర్‌ఎస్‌కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నల్లా రామచందర్ రావు ఈ అంశాన్ని ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లాలని విజ్ఞప్తి చేశారు.


Today's Best Deals

Rs. 270.00

Emoji Expressions Matching Game

Rs. 480.00

Labubu Bunny Keychain

Rs. 100.00

Face Changing Keychain

Rs. 230.00

Busy Book