National

చిలీ, అర్జెంటీనా తీరాల్లో భారీ భూకంపం – సునామీ హెచ్చరిక

చిలీ, అర్జెంటీనా తీరాల్లో భారీ భూకంపం – సునామీ హెచ్చరిక

శుక్రవారం ఉదయం చిలీ మరియు అర్జెంటీనా తీర ప్రాంతాల సమీపంలో 7.4 తీవ్రత గల భూకంపం సంభవించింది. USGS ప్రకారం, భూకంప కేంద్రం ద్రేక్ పాసేజ్ ప్రాంతంలో, అర్జెంటీనాలోని ఉషువాయా నగరానికి దక్షిణంగా 219 కి.మీ దూరంలో ఉంది. ఇది భూమి లోపల 10 కి.మీ లోతులో నమోదైంది.

ఈ భూకంపంతో సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. చిలీ మాగల్లానెస్ రీజియన్ తీర ప్రజలను ఖాళీ చేయాలని అధికారుల ఆదేశాల మేరకు తరలించారు. అంటార్కిటికా మరియు దక్షిణ చిలీ తీరాలకు అలలు తాకే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ప్రజలు శాంతంగా ఖాళీ చేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

చిలీ అధ్యక్షుడు గాబ్రియేల్ బోరిక్ స్పందిస్తూ – అన్ని అత్యవసర వనరులు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. ప్రజలు అధికారుల సూచనలు పాటించాలని విజ్ఞప్తి చేశారు. అర్జెంటీనాలో ఉషువాయా నగరంలో ప్రకంపనలు కనిపించినప్పటికీ, నష్టం జరగలేదు. ముందు జాగ్రత్తగా బీగిల్ ఛానెల్ లో నీటి కార్యకలాపాలను మూడు గంటల పాటు నిలిపివేశారు.


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens