పంచముఖ మహాశివం భక్తి గీతాల ఆవిష్కరణ & నాట్య కార్యక్రమం – 25 మే 2015, హైదరాబాద్ | Manavoice

ఆదివారం, 25-05-2015 ఉదయం 9:00 గంటలకు
మీరు, మీ స్నేహితులు, బంధువులు, సంగీతాభిమానులు మరియు భక్తులందరికీ మా హృదయపూర్వక ఆహ్వానం.

ఈ శుభ సందర్భంలో "పంచముఖ మహా శివం" భక్తి పాటల ఆవిష్కరణ, చిన్నారుల భరతనాట్యం, ముఖ్య అతిథిగా డా. జె. కృష్ణ కిషోర్ గారు (ఇస్రో – ఇండియా) ప్రసంగం, డా. ఓలేటి పార్వతీశం గారి ప్రసంగం జరుగనున్నాయి.

పాటల ఆవిష్కరణను శ్రీమతి గౌరీ పద్మావతి గారు మరియు శ్రీ యాళ్ళ వరప్రసాద్ గారు నిర్వహించనున్నారు.
భక్తి గీతాలతో డా. వరుణ్ రాజు గారు మరియు ఉదయ్ కుమార్ గారు మనసులను హత్తుకుంటారు.

ఈ సందర్భంగా మహా శివుడి ప్రసాదం భక్తులందరికీ అందజేయబడుతుంది. ఇంకా ఎన్నో ప్రత్యేక కార్యక్రమాలు మీ కోసం.

ఈ ఆధ్యాత్మిక - సాంస్కృతిక వేడుకను మీరు గుర్తుంచుకుని, తప్పకుండా విచ్చేసి మమ్మల్ని గౌరవించగలరని ఆశిస్తున్నాము.

స్థలం: త్యాగరాయ గానసభ, చిక్కడపల్లి, హైదరాబాద్, తెలంగాణ
ధన్యవాదములతో,
డా. వరుణ్ రాజు, హైదరాబాద్


Today's Best Deals

Rs. 270.00

Emoji Expressions Matching Game

Rs. 480.00

Labubu Bunny Keychain

Rs. 100.00

Face Changing Keychain

Rs. 230.00

Busy Book