National

అయోధ్యలో రియల్ ఎస్టేట్ బూమ్: భూముల ధరలు భారీగా పెరుగుదల

అయోధ్యలో భూమి ధరలు భారీగా పెరిగాయి

ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో రామమందిరం నిర్మాణం అనంతరం భూముల కొనుగోలు-విక్రయాలు వేగంగా పెరిగాయి. దీని ఫలితంగా భూమి ధరలు భారీగా పెరిగాయి. అధికారుల ప్రకారం, ఆలయానికి సుమారు పది కిలోమీటర్ల పరిధిలో భూముల ధరలు 30% నుంచి 200% వరకు పెరిగాయని చెప్పారు. ఇది గత ఎనిమిదేళ్లలో తొలిసారి ఇంత భారీ ధర పెరుగుదల.

కొత్త సర్కిల్ రేట్లు ఈ నెల 7వ తేదీ నుండి అమల్లోకి వస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

సదర్ (ఫైజాబాద్) సబ్ రిజిస్ట్రార్ శాంతి భూషణ్ చౌబే తెలిపారు, 2004 సెప్టెంబరులో ప్రతిపాదించిన భూమి ధరల సవరణలను ఇప్పుడు జిల్లా మేజిస్ట్రేట్ ఆమోదంతో అమలు చేస్తున్నామని చెప్పారు.

నూతన రేట్ల ప్రకారం, రాకాబ్ గంజ్, దేవ్ కాళి ప్రాంతాల్లో భూముల ధరలు గణనీయంగా పెరుగుతాయని తెలిపారు. అయోధ్య ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా ఉన్నందున, రామాలయం పరిసర ప్రాంతాల్లో సర్కిల్ రేట్లు చదరపు మీటరుకు రూ.26,600 నుంచి రూ.27,900 వరకు చేరాయని చెప్పారు. గతంలో ఈ ధర రూ.6,650 నుంచి రూ.6,975 వరకు మాత్రమే ఉండేది.

ల్యాండ్ రెసిడెన్షియల్, కమర్షియల్, అగ్రికల్చరల్ అన్న మూడు వర్గాలలో భూమి ధరలు వేరే వేరే రేట్లతో పెరుగుతాయని చౌబే తెలిపారు.

రియల్ ఎస్టేట్ వ్యాపారి వివేక్ అగర్వాల్ ప్రకారం, భూముల ధరల పెరుగుదలతో స్టాంప్ డ్యూటీ కూడా పెరుగుతుందన్నా, భూమి యజమానులకు ఇది లాభదాయకం అని పేర్కొన్నారు.


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens