బ్యాంకు ఉద్యోగాల కోసం ఎదురు చూసే నిరుద్యోగులకు శుభవార్త.. యూనియన్ బ్యాంకులో డిగ్రీ అర్హతతో కొలువులకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పోస్టులకు డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్ధులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం ఎన్ని పోస్టులు భర్తీ చేస్తారంటే..
ముంబయి ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న యూనియన్ బ్యాంక్ దేశవ్యాప్తంగా ఉన్న బ్రాంచుల్లో స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్ధులు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా 500 పోస్టులు భర్తీ చేయబడతాయి. ఇందులో 250 అసిస్టెంట్ మేనేజర్ (క్రెడిట్) మరియు 250 అసిస్టెంట్ మేనేజర్ (ఐటీ) పోస్టులు ఉన్నాయి. అభ్యర్థులు మే 20, 2025 వరకు ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవచ్చు.
అర్హత కోసం అభ్యర్థులకు సంబంధిత విభాగంలో B.Tech లేదా BE, CA, CS, ICWA, MSc, ME లేదా MTech, MBA లేదా PGDM, MCA, PGDBMలో ఉత్తీర్ణత సాధించాలి. అలాగే, ఒక సంవత్సరానికైన పని అనుభవం కూడా ఉండాలి. అభ్యర్థుల వయోపరిమితి ఏప్రిల్ 1, 2025 నాటికి 30 సంవత్సరాలు మించకూడదు. రిజర్వేషన్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఆసక్తిగల అభ్యర్ధులు 11:59 PM, మే 20, 2025 నాటికి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. తుది ఎంపిక ఆన్లైన్ రాత పరీక్ష మరియు గ్రూప్ డిస్కషన్ ఆధారంగా ఉంటుంది. ఎంపికైన వారికి ₹48,480 నుండి ₹85,920 వరకు జీతం చెల్లించబడుతుంది.
రాత పరీక్ష వివరాలు:
రాత పరీక్ష మొత్తం 150 ప్రశ్నలు మరియు 225 మార్కులు కలిగి ఉంటుంది. పార్ట్ 1లో:
క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్: 25 ప్రశ్నలు, 25 మార్కులు
రీజనింగ్: 25 ప్రశ్నలు, 25 మార్కులు
ఇంగ్లిష్ లాంగ్వేజ్: 25 ప్రశ్నలు, 25 మార్కులు (మొత్తం 75 మార్కులు)
పార్ట్ 2లో సంబంధిత పోస్టుకు సంబంధించిన ప్రొఫెషనల్ నాలెడ్జ్ పై పరీక్ష ఉంటుంది, ఇది 150 మార్కులకు ఉంటుంది. మొత్తం 150 నిమిషాల పాటు పరీక్ష ఉంటుంది. గ్రూప్ డిస్కషన్ కు 50 మార్కులు ఉంటాయి, ఇందులో కనీసం 25 మార్కులు సాధించాల్సి ఉంటుంది.